Tuesday, May 7, 2024
- Advertisement -

తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోవొద్దు.. మీకోసమే ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ : వైఎస్ షర్మిల

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఎంతగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా భారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తా అంటూ వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టె దిశగా వెళ్తున్నారు. ఆ మద్య నిరుద్యోగుల కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేబట్టారు. అంతే కాదు సమయం చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై పదునైన బాణాలు సందిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ సందర్భంగా కరోనా బాధితుల కోసం వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా జీవిత భాగస్వాములను, కన్నబిడ్డలను, అయినవారిని కోల్పోయిన మహిళలకు ఆసరాగా నిలిచేందుకు ‘వైఎస్ఎస్ఆర్’ టీమ్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ తో ఎంతో మంది చనిపోతున్నారని.. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన మహిళలు ఎన్నో అవస్థలు పడుతున్నారు.

కుటుంబ పోషణ చేయలేక, నిరాశా నిస్పృహలతో కుంగిపోతున్న మహిళల ఆదుకునేందుకు తమ వంతు కృషిగా ‘వైఎస్ఎస్ఆర్’ టీమ్ ఏర్పాటు చేసినట్లు వైఎస్ షర్మిల తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోరాదని పిలుపునిచ్చారు. మీ జీవితం సాఫీగా సాగేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను. మీరంతా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులని భావిస్తున్నాను. సాయం కావాల్సి వస్తే 040-48213268 ఫోన్ నెంబరుకు సమాచారం అందించండి అని షర్మిల సూచించారు.

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

అఫ్గానిస్థాన్ లో ఘోరం..రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి

రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -