కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నియమితులైయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి నియామకానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. పీసీసీ పదవి ఆశించి కోమటిరెడ్డి భంగపడ్డారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పరోక్షంగా రేవంత్రెడ్డిపై విమర్శలు సైతం గుప్పించారు. ఈక్రమంలోనే ఆయన బీజేపీలోకి చేరుతారని ప్రచారం సైతం జరిగింది. ఇటీవల ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు.
అయితే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంటికి రేవంత్రెడ్డి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా కోమటిరెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా నియమించారు. ఇది పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.