ఏపీలో మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా చాన్స్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో నలుగురు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ బిష్వభూషణ్ అందుకు ఆమోదం తెలిపారు. సోమవారం ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి.. గవర్నర్తో సమావేశమయ్యారు. వీరిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సీఎం జగన్ గవర్నర్ కోటా కింద.. మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ అందుకు ఆమోద ముద్ర వేశారు.
గతంలో గవర్నర్ కోటాలో ఎన్నికైన టీడీ జనార్దన్, బీద రవిచంద్ర, గౌనిగారి శ్రీనివాస్, పి.శమంతకమణి పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల ఎంపికలో సీఎం జగన్.. సామాజిక న్యాయం పాటించారు.ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోషెన్రాజు, కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, బీసీ వర్గానికి చెందిన రమేశ్ యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అప్పిరెడ్డి ల పేర్లను ఆయన ప్రతిపాదించారు.
నిజానికి మండలిలో టీడీపీ బలం ఉంది. ఈ క్రమంలో పలు బిల్లులు అక్కడ పెండింగ్లో పడుతున్నాయి. దీంతో ఓ దశలో మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ భావించారు. అందుకోసం ఏకంగా శాసనసభలో తీర్మానం చేసి.. పార్లమెంటుకు పంపారు. అది కేంద్రం పరిధిలో పెండింగ్లో ఉంది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ ఈ విషయంలో మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఎందుకంటే వైసీపీ లో చాలా మంది ఆశావహులు ఉన్నారు. వారంతా పదవులు ఆశిస్తున్నారు. దాంతో పాటు త్వరలో మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరగనుంది. దీంతో మండలిని కొనసాగించాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం.
Also Read
ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్పై క్యాడర్ నిరుత్సాహం
తమిళనాట చిన్నమ్మ ప్రకంపనలు.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు..!