Sunday, May 5, 2024
- Advertisement -

బాబుకు చుక్క‌లు చూపించిన జాతీయ మీడియా…

- Advertisement -

మీడియాను మేనేజ్ చేయ‌డంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దిట్ట అన‌డంలో సందేహంలేదు. కాలం క‌ల‌సి రాక‌పోతే తాడే పాముగా మారి కాటేస్తుంద‌నే సామెత ఇప్పుడు బాబుకు స‌రిపోతుంది. ఇప్పటి వరకూ టిడిపికి మద్దతుగా నిలిచే మీడియాతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నెట్టుకొచ్చిన చంద్రబాబుకు ఢిల్లీ మీడియా చుక్క‌లు చూపించింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియ‌క చేతు లెత్తేశారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం బాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో గ‌డ‌ప‌నున్నాన‌రు. ప్రత్యేకహోదా, కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు కూడగట్టటమే లక్ష్యంగా చివరి నిముషంలో చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ పార్టీల నేత‌ల‌తో బిజీగా గ‌డిపిన బాబు డ‌బ్బా కొట్టుకోవ‌డానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌లో బాబుకు ఊహించ‌ని అనుభ‌వం ఎదుర‌య్యింది.

ప్రత్యేకహోదా కోసం తాను చేస్తున్న కృషిని, అవిశ్వాస తీర్మానానికి తాను కూడగడుతున్న మద్దతును గొప్పగా చెప్పుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. మీడియా సమావేశం మొదలుకాగానే జరిగింది ఇంకోటి. ప్రత్యేకహోదా విషయంలో మూడున్నరేళ్ళుగా చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు, బిజెపితో అంటకాగిన విధానం, ఏపికి కేంద్రం నుండి ఎటువంటి సాయంరాదని అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం మద్దతుగా నిలబడటం, చివరి నిముషంలో ఎన్డీఏ నుండి బయటకు వచ్చేయటం వల్ల సాధించబోయేదేమిటి? లాంటి అనేక ప్రశ్నలను సంధించింది. వాటికి స‌మాధానం చెప్ప‌లేక చేతులెత్తేశారు. రాష్ట్రంలో అయితే బాబు ఏం చెప్పినా డ‌బ్బాకొట్టే జాతి మీడియా అనుకున్నారు జాతిమీడియా అంటే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -