అమలు కాని హామీలను గుప్పించి.. అడ్డదారులు తొక్కి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పేట్టు లేదు. సగానికి పైగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంది. పైగా పెద్ద సంఖ్యలో మంత్రుల్లో పరాజయం పొందుతారని విషయం తేటతెల్లమైంది. ఈ విషయం స్వయానా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను చూసి చంద్రబాబుకు చుక్కలు కనిపించాయి. ఇంతేసి మంది ఓడిపోతే ఇంకేటి పరిస్థితి అని వెంటనే ఆలోచనలో పడ్డాడు.
చంద్రబాబునాయుడు స్వయానా తమ పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై సర్వే చేయించుకుందని ఓ ఆంగ్ల పత్రికలో వెల్లడైంది. ఆ సర్వేలో చంద్రబాబుకు విస్తుపోయే విషయాలు రావడంతో ఖంగు తిన్నాడు. పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని అనుకుంటూ పరిపాలన సాగిస్తున్న చంద్రబాబుకు ఈ సర్వే ఫలితం మింగుడు పడడం లేదు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారనే విషయం షాకిచ్చింది. కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక 26 మంది మంత్రుల్లో 8 మంది మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి.
ఈ విషయాలు వెల్లడవడంతో ప్రభుత్వం, టీడీపీ బయటకు రానీయలేదు. గెలిచే అవకాశాలు ఉన్నాయనే ఆశతో సర్వే చేయిస్తే ఫలితం ఇలా ఉండడంతో ఈ విషయం బయటకు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఫలితం బాగుంటదనే భావించి బహిర్గత పరచాలని అనుకున్నారు.