Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసేలోపు అక్ర‌మాస్తుల కేసుల్లో అరెస్టు కావ‌డం ఖాయం…

- Advertisement -

ఫిరాయింపు టీడీపీ మంత్ర ఆదినార‌య‌ణ‌రెడ్డి వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెడుతున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచి అధికార‌పార్టీనేత‌లు , మంత్రులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తూనె ఉన్నారు. అయితె ఇప్పుడు తాజాగా మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న రాజీనామ ఆమోదిస్తె త‌న నియేజ‌క వ‌ర్గంలో పోటీకి దిగి స‌త్తా చూపిస్తాన‌ని మంత్రి ఉద్ఘాటించారు. ప‌నిలో ప‌నిగా మ‌రికొన్ని రోజుల్లో పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై మండిప‌డ్డారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసేలోపు అక్ర‌మాస్తుల కేసుల్లో అరెస్టు కావ‌డం ఖాయమ‌ని అన్నారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లు చేస్తే త‌మ‌కేం అభ్యంత‌రాలు లేవని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బ‌హిష్క‌రించాల‌నే నిర్ణ‌యం వెనుక జ‌గ‌న్ కుట్ర ఉంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న ఎమ్మెల్యేలు పార్టీ మార‌తార‌నే భ‌యంతోనే జ‌గ‌న్ ఆ నిర్ణ‌యం తీసుకుంటున్నారని ఆరోపించారు. మ‌రి వైసీపీ నేత‌లు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -