Sunday, May 12, 2024
- Advertisement -

ప‌వ‌న్ మ‌ద్ద‌తుపై తేల్చేసిన అఖిల ప్రియ‌…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో మంత్రి అఖిల ప్రియ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.న తండ్రి భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపణలు చేశారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డికి మద్దతు ఇచ్చి, గెలిపించామని అఖిల చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని చెప్పారు.

ఆయనకు ఓటు వేస్తే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటారనే భయం ఓటర్లలో ఉందని అఖిలప్రియ చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ కుటుంబానికి ఆయన అండగా ఉంటారన్నారు.

తాను నంద్యాల ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందన్నారు. అయితే భూమా కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ఆ కుటుంబానికి మద్దతిచ్చే అవకాశాలున్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు.

https://www.youtube.com/watch?v=Rul64mRbJlo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -