Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి…

- Advertisement -

తం అధికార …విప‌క్షాల మ‌ధ్య ఫిరాయింపుల అంశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీనిపైన ఎంచ ర‌చ్చ జ‌రిగిందో అంద‌రికి తెలిసిందే. వైసీపీ త‌రుపును గెలిచిన 21 మంది ఎమ్మేల్యేలు పిరాయింపుల ద్వారా టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతోపాటు …మంత్రి ప‌ద‌వులు కూడా పొందారు. ఇప్పుడు ఇదే ఇంట్ర‌స్ట్‌గా ఉంది.

వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామ చేసి టీడీపీలోకి వెల్లాల‌ని ప్ర‌తిప‌క్షం ఎన్నిసార్లు స‌వాల్ విసిరినా దున్న‌పోతు మీద వాన కురిసిన‌ట్లు అధికారాపార్టీ అధినేత‌గాని పిరాయంపు మంత్రులుగాని స్పందించ‌రు. ఏదో ఒక షాకులు చెబుతూ త‌ప్పించుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

అయితే తాజాగా ఫిరాయింపు మంత్రి అఖిల ప్రియ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటారా అంటె అదీలేదు. ఇప్పుడేమో కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. ఇప్పుడు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామ చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ని ప్ర‌క‌టించారు. ఆశలేదు. ప్రజలు నా వైపున ఉన్నారనే నమ్మకం నాకు ఉంది.. 2019 లో అది నిరూపితమవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

రాజీనామా చేయమని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశిస్తె చేస్తానంటు కొత్త ప‌లుకులు ప‌లుకుతోంది. నంద్యాలలో జగన్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేద‌ని అమాయ‌కంగా ప్ర‌శ్నించింది. తన తండ్రి భూమా నాగిరెడ్డిపై శిల్పామోహన్ రెడ్డి గతంలో చాలా కేసులు పెట్టారు. భూమా ఒక బ్రాండ్..ఆ పేరు నిలబెడతాం పాత‌పాటె పాడుతోంది. బాబు రాజీనామ చేయ‌మ‌ని ఆదేశించ‌డు…..అఖిల ఆ ప‌ని చేయ‌దు. అంత ధైర్యం ఉంటె ఈ పాటికి రాజీనామ చేసిండాలి. ఇప్పుడేమో బాబు ఆదేశిస్తె రాజీనామా చేస్తానంటూ త‌ప్పించుకొనె ప్ర‌య‌త్నం చేయ‌డం ఎందుకో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -