వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారయ్యింది. పార్టీకి షాక్ లమీద షాక్లు తగులుతున్నాయి. 2019 ఎన్నికలకు ఇంకా మరో యేడాదిన్నర టైం మాత్రమే మిగిలి ఉంది. దీంతో జగన్కు అగ్నిపరీక్ష మొదలయ్యింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడంతోపాటు …ఎన్నికలకు రెడీ అవ్వాల్సి ఉంటుంది.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్నయాలు తీసుకుంటారోనని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు, నంద్యాల, అరకు ఎంపీలు టీడీపీ తీర్థం పుచ్చున్నారు. ఇదే జాబితాలో తాజాగా ఇద్దరు ఎంపీలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి గత నాలుగుసార్లుగా వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. జగన్ కోసం ఆయన తన ఎంపీ పదవిని వదులుకుని ఉప ఎన్నికల్లో టీఎస్సార్పై పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాల విషయంలో జగన్ ఎంపీలకు చెప్పకుండానే ముందే ప్రకటన చేసేశారని…దీనిగురించి జగన్ మాటమాత్రమైనా చెప్పాలని జగన్కు సూచించారంట. అయితే జగన్ మాత్రం మేకపాటిపై సీరియస్ అయనట్టు సమాచారం. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందనె వార్తలు వినిపిస్తున్నాయి.
మేకపాటి తనయుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్ ద్వారా టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట. గౌతమ్కు పార్టీ కండువా కప్పుతె….తండ్రి రాజమోహన్రెడ్డి జగన్ను వీడడం ఖాయమంటున్నారు. మేకపాటితో పాటు ఎప్పటి నుంచో ఊగిసలాటలో ఉన్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరేందుకు రెడీగానే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటుపై చంద్రబాబు నుంచి ఆమెకు హామీ రాకపోవడంతోనే ఆమె డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది.
రేపో మాపో అయినా రేణుక కూడా టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికె 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ఇప్పటికే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరుకూడా పార్టీమారితె వచ్చె ఎన్నికల సమయానికి పార్టీ ఖాలీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్కు ఇప్పుడే అసలైన అగ్నిపరీక్ష మొదలైందని….దీన్ని తట్టుకొని నిలబడటంపైనె భవిష్యత్తు ఆధారపడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.