- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై భాజాపా ఎంపీ హరిబాబుపై విమర్శలు గుప్పించారు. బాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలవాలని చూస్తోందని బాబు ఆరోపనలు చేయడం తగదన్నారు. ఎన్నికల వ్యూహంపై బీజేపీలో ఇప్పటివరకూ చర్చ జరగలేదని, తాము ప్రస్తుతం తమ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే విజయవాడలో జగన్ పై చేసిన వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయం కాదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని హరిబాబు అన్నారు. కాంగ్రెస్కు దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారని హరిబాబు ఆరోపించారు. కాగా, పోలవరం తెలుగు ప్రజలకు నరేంద్ర మోదీ ఇచ్చిన వరమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హరిబాబు తెలిపారు.