Sunday, May 5, 2024
- Advertisement -

చంద్ర‌బాబును జైలుకు పంపేంత వ‌ర‌కు నిద్ర‌పోను..విజ‌య‌సాయి శ‌ప‌థం

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ నిప్పులు చెరిగారు. బాబు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడ‌ర‌ని ఆరోపించారు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ సభాప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించేవరకు తాను నిద్రపోనని తెలిపారు.

దేశంలో హవాలా, విదేశాల్లో ఆర్మ్‌డ్ డీలర్లతో బాబుకు సంబంధాలున్నాయని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అధర్మ సభ అని అన్నారు. ప్రధానమంత్రి మోదీని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను ప్రధానిని కలిసింది నిజమే. ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా గురించి తెలిపేందుకు ఆయన్ను కలిశా. అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తా. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలు సమర్పిస్తా. బాబును జైల్లో పెట్టించే వరకు నిద్రపోను’’ అని విజయసాయి రెడ్డి శ‌ప‌థం చేశారు.

చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలను సమర్పిస్తానని చెప్పారు. అవినీతికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారింద‌న్నారు. గత్యంతరం లేని స్థితిలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -