Saturday, May 18, 2024
- Advertisement -

దేవుడా……… లోకేశా…….. కామెడీతో సంపేసినవ్ కదా సామీ…..

- Advertisement -

లోకేష్‌ని నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి బాబు పడుతున్న పాట్లు పక్కనపెడితే కనీసం లోకేష్‌ చేత తప్పులు లేకుండా మాట్లాడించడానికి లక్షలు ఖర్చుపెడుతున్నాడు చంద్రబాబు. అఫ్కోర్స్……ఆ మనీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచే కేటాయించి ప్రజలపైనే ఆ భారాన్ని కూడా వేసేస్తున్నారనుకోండి. అయినా ఏం ఉపయోగం……అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయంలో బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు…….రాష్ట్ర ప్రజలపై ఇంకాస్త భారం మోపుతూ లోకేష్‌కి తెలుగు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చినబాబు మాత్రం రోజు రోజుకూ మరీ తీసికట్టుగా తయారవుతున్నాడు.

లోకేష్ విషయం పక్కనపెడితే తాజాగా సిఎం రమేష్ దీక్షా విరమణ సభ అంటూ పచ్చ బ్యాచ్ చేసిన హంగామా సమావేశంలో లోకేష్‌ని మించిన కామెడీ చేశాడు చంద్రబాబు. సిఎం రమేష్‌ని పోట్టి శ్రీరాములుని మించిన వాడని చెప్పాలన్న తాపత్రయంలో పొట్టి శ్రీరాములు దీక్షా విరమణ చేశాడని సెలవిచ్చారు. ఇక లోకేష్ బాబు అయితే పొట్టచెక్కలయ్యే స్థాయిలో కామెడీ పండించేశాడు. ఆ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికకు ఎడిటోరియల్ వ్యాసం రాసి ఇచ్చిన లోకేష్ బాబు పట్టుమని నాలుగు ముక్కలు కూడా తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడలేకపోయాడు.

ఇక స్వయానా చంద్రబాబును అభినందించాల్సిందే అని ‘నాన్నగోరి’ గురించి లోకేష్ చెప్పిన మాటలు అయితే మొత్తం ప్రసంగంలో హైలైట్ అనొచ్చు. చంద్రబాబుతో సహా రాధాకృష్ణ, రామోజీరావులు అందరూ కూడా లోకేష్‌ని నాయకుడిగా నిరూపించడానికి నానా అవస్థలూ పడుతున్నారు కానీ చినబాబు మాత్రం కనీసం స్కూల్ స్టాండర్డ్స్ నాయకుడిగా నిరూపించుకోలేక……పొలిటికల్ తెరపై బ్రహ్మాండమైన కామెడీ చేస్తూ పొలిటికల్ బ్రహ్మీగా మిగిలిపోయేలానే కనిపిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=4-Pct4tAHEw

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -