నిన్నటి వరకు మిత్రులు..ఇప్పుడు శత్రువులు. మిత్రపక్షాలు భాజాపా-టీడీపీ మధ్య బంధం దాదాపు తెగిపోయినట్లే. ఇరు పార్టీలు మాటల యుద్ధానికి సిద్దమవుతున్నాయి. తాజాగా రాష్ట్ర భాజాపా నేతలతో జాతీయ అధ్యక్షుడు అమీత్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీని ఎండగట్టాలని అమీత్ నేతలకు సూచించారు.
దీంతో భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టారు. ఇక తమ కార్యవర్గ సమావేశాలు టీడీపీకి మిత్రపక్షంగా కాకుండా ప్రతిపక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మీడియాలో తాము వేసే ప్రశ్నలను సరిగ్గా చూపించడం లేదని, టీడీపీ వేసే ప్రశ్నలనే ఎక్కువగా చూపుతున్నారని అన్నారు.
తాము ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేశామని, వాటికి సమాధానాలు చెప్పకుండా టీడీపీ నేతలు బీజేపీ వైసీపీ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతోందని అంటున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పకుండా టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. తాము టీడీపీని అడుగుతోన్న ప్రశ్నలను పక్కనబెట్టి మీడియా టీడీపీ వేసే ప్రశ్నలనే చూపెడుతోందని అన్నారు. ఇక నుంచి టీడీపీ మీద భాజాపా ఎదురుదాడి చేయనుంది.