Tuesday, May 7, 2024
- Advertisement -

దెబ్బ‌కొట్టిన క్లైమాక్స్ … ల‌బో దిబో మంటున్న టీడీపీ డిస్ట్రి బ్యూట‌ర్లు…

- Advertisement -

నంద్యాల‌లో చంద్ర‌ బాబు ద‌ర్శ‌క‌త్వంలో తీసిన గంగుల సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. బాహుబ‌ళి రేంజ్‌లో తీయాల‌నుకున్న సినిమా చివ‌రికి బాబునే బ‌ల‌య్యారు. దీంతో టీడీపీ డిస్ట్రిబ్యూట‌ర్లు ల‌బోదిబో మంటూ మొత్తుకుంటున్నారు. సినిమా ఏంటి బాబు డైరెక్షన్ అనుకుంటున్నారా..అక్క‌డికే వ‌స్తున్నా…!

ముఖ్య అనుచరులతో కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి చంద్రబాబును కలిసి పచ్చకండువా కప్పేసుకున్న గంగుల ప్రతాప్ రెడ్డిని సొంత మనుషుల నుంచే షాక్‌లు తగులుతున్నాయి. గంగుల ప్ర‌తాప్ రెడ్డిని హీరోగా పెట్టి వైసీపీని దెబ్బ‌తీయాల‌ని బాబు తీస‌ని సినిమా చివ‌ర‌కు బెడిసి కొట్టింది.

తన బంధువులైన కొందరిని భోజనానికంటూ గంగుల తన ఇంటికి పిలిపించుకున్నారు. వెంటనే మంత్రులకు కబురు పంపారు. అంతే గంగుల ఇంటి వద్ద వాలిపోయిన మంత్రులు… గంగుల బంధువులకు కండువాలు కప్పేశారు. తెల్లవారాక చూస్తే టీడీపీ అనుకూల పత్రికల్లో టీడీపీలోకి భారీ చేరికలంటూ పెద్దపెద్ద ఫొటోలు పెట్టి కథలు రాసేశారు. గంగుల ప్రతాప్ రెడ్డి ఇంటి వద్దకు పది మంది వెళ్లగా ఏకంగా 800 మంది టీడీపీలో చేరిపోయారంటూ కథనాలు రాసేశారు.

ప‌త్రికల్లో తమ ఫొటోలు చూసి వైసీపీ నేతలు బిత్తరపోయారు. భోజనానికి ఇంటికి పిలిచి ఇలా చేస్తారా అని నిలదీస్తే గంగుల ప్రతాప్ రెడ్డి నుంచి సమాధానం లేదు. దీంతో వైసీపీ స్థానిక నాయకులు ప్రసాద్ రెడ్డి తదితరులు మీడియా ముందుకు వచ్చి తమతో గంగుల ప్రతాప్ రెడ్డి, టీడీపీ మంత్రులు ఆడిన నాటకాన్ని వివరించారు.

శిల్పాచక్రపాణిరెడ్డిని, వైసీపీ ఎమ్మెల్సీ గుంగుల ప్రభాకర్ రెడ్డిని కలిసి జరిగింది వివరించారు. పెద్దాయన గంగుల ప్రతాప్ రెడ్డి పిలుస్తున్నారన్న గౌరవంతో ఇంటికి వెళ్తే తమ వ్యక్తిత్వాలను హత్య చేసేలా వ్యవహరిస్తారని ఊహించలేదని ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. చివ‌రి వ‌ర‌కు తాము వైసీపీకి వీరాభిమానులమ‌న‌డంతో బాబు తీసిని సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. పాపం బాబు సినిమాపై ఆశ‌లు పెట్టుకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు చివ‌రకు బ‌ల‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -