Thursday, April 25, 2024
- Advertisement -

తెంలగాణాలో ల‌గ‌డ‌పాటి లేటెస్ట్ స‌ర్వే..

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల్లో విజేత ఎవ‌రో తేల్చేశారు ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. తాజాగా విడుద‌ల చేసిన స‌ర్వే వివ‌రాలు రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం సర్వే వివరాలను వెల్లడించారు రాజ‌గోపాల్‌.

ఈ ఎన్నిక‌ల్లో ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగడం లేదని బాంబు పేల్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల వైపే జనం మొగ్గు చూపుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి 10 మంది స్వతంత్రులు గెలవబోతున్నారని స్పష్టం చేశారు. నారాయణ్‌పేట్‌, భోథ్‌లో ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి తేల్చారు. వీల్లే కింగ్ మేక‌ర్‌లు అవుతార‌ని జోష్యం చెప్పారు.

బోథ్ లో అనిల్ జాదవ్, నారాయణపేట్ లో శివకుమార్ లు గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. పలుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. రోజుకు ఇద్దరు గెలిచే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. దీనిని బట్టి వారికి వారికి ప్రజల్లో ఏ స్థాయిలో పట్టుందో అర్థమవుతోందని రాజగోపాల్ అన్నారు. రాజ‌గోపాల్ స‌ర్వే ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -