Saturday, May 18, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే భాజాపాకు ప‌డుతుంది…

- Advertisement -

రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించినందుకు కాంగ్రెస్‌క ప‌ట్టిన గ‌తే భాజాపాకు ప‌డుతుంద‌ని స‌ర్వేల రారాజు ల‌గ‌డ‌పాటి రాజ‌క‌గోపాల్‌ హెచ్చ‌రించారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు ఘోరీ క‌ట్టార‌ని ….రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌కుంటే భాజాపా ప‌రిస్థితికూడా అంతేన‌న్నారు.

ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. తాజా రాజకీయాలతో పాటూ విభజన హామీలు, హోదా అంశంపై స్పందించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యమన్నారు లగడపాటి. రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉద్యోగావకాశాలు రావాలంటే హోదా కావాల్సిందేనన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు.

పోరాటాలతో ప్రత్యేక హోదాను సాధించాలే తప్ప.. ఆత్మహత్యలు, బలిదానాలతో అది సాధ్యం కాదన్నారు . రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా.. ప్యాకేజీనా అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయించుకోవాలన్నారు లగడపాటి. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. సర్వే గురించి ఇప్పుడే ఏం మాట్లాడనని.. ఎన్నికలకు ముందు ఆ వివరాలను వెల్లడిస్తానన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -