Wednesday, May 15, 2024
- Advertisement -

కొత్త సంవ‌త్స‌రంలో రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం ..

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క‌రు వెలుగులోకి వ‌స్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి నాలుగు సంవ‌త్స‌రాల పాటు కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఒక్క‌మాట విమ‌ర్శించ‌న‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్పుడు తాజ‌గా రేవంత్ రెడ్డికూడా అదేబాట‌లో ఉన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా నియ‌మితుల‌య్యారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ప్ర‌ధాన ఆక‌ర్శ‌న‌గా నిలిచారు. అత్య‌ధిక మెజారిటీతో గెలుస్తార‌నున్న రేవంత్ అనూహ్యంగా ఘోర ఓట‌మి పాల‌వ‌డంతో అజ్ణాతంలోకి వెల్లిపోయారు. కొద్ది రోజులుగా మీడియాకు ముఖం చాటేశారు. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

రెండు సంవత్స‌రాల పాటు మీడియా ముందుకు రాన‌ని ప్ర‌తిని బూనారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ ఓట‌మిపై స‌మీక్ష నిర్వ‌హించిన పార్టీ అగ్ర నేత‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -