Monday, May 6, 2024
- Advertisement -

చంద్రబాబు…అయినను పోయిరావలె హస్తినకు!

- Advertisement -

అయినను పోయిరావలె హస్తినకు…ఇప్పుడు ఈ డైలాగ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఓ వైపు ఐటీ నోటీసులు మరోవైపు పుంగనూరు అల్లర్ల కేసు…వెరసీ చంద్రబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం ఒప్పుకున్నారు. రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారేమోనని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసినా అదేమి ఫలించలేదు.

ఇక అయినను పోయిరావలె హస్తినకు అంటే…రాయబారానికి వెళ్లే ముందు పాండవులంతా తమ మనోగతాన్ని కృష్ణుడికి చెబుతారు. అదే క్రమంలో దుర్యోదనుల దగ్గరకు శాంతిదూతగా వెళ్తున్న కృష్ణునికి అవమానం జరుగుతుందోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తారు ధర్మరాజు. ఈ క్రమంలో కృష్ణుడు..ధర్మరాజుతో మీ ఐదుగురు పరాక్రమవంతులే. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు సంధికి ఒప్పరని కూడా తెలుసు. ఐనా హస్తినకు వెళ్ళి రావాలి. సంధి ఫలించినా లేకున్నా, అక్కడకు వెళ్ళటం వలన మంచి జరిగితే లాభమే లేదంటే శత్రువుల బలాబలాలు తెలుస్తాయి అని చెబుతారు కృష్ణుడు.

అయితే కాస్త అటు ఇటుగా అయినా ఈ డైలాగ్ ఇప్పుడు చంద్రబాబుకు కరెక్ట్‌గా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ నుండి కాపాడేది ఒక్క బీజేపీ మాత్రమే. అయితే ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు హస్తినకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మరోక్కసారి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నం చేస్తే తప్పుకాదని చంద్రబాబుకు ముఖ్య నేతలు సూచిస్తున్నారట. వాస్తవానికి చంద్రబాబు…బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత ఐటీ నోటీసులు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు షాక్ తిన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత హస్తినకు వెళ్లి బీజేపీ పెద్దలను కలవాల్సిన పరిస్థితే. లేదంటే రాజకీయంగా టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -