టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా జనసైనికులు తీవ్రంగా భంగపడ్డారు. పొత్తులో భాగంగా సీట్లు కొల్పోగా జనసేన కార్యకర్తలకు మిగిలింది టీడీపీ, బీజేపీ జెండాలే. చంద్రబాబు నివాసంలో సీట్ల పై సుదీర్ఘంగా 8 గంటల పాటు సాగిన మూడు పార్టీల నేతల సమావేశం జరిగింది. బీజేపీ మార్క్ రాజకీయంలో చంద్రబాబు, పవన్ చిక్కుకోగా బీజేపీ కోసం పవన్ ను బలి చేశారు చంద్రబాబు.
జనసేనకు కేటాయించిన సీట్లలో 1 ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాల కోత విధించగా విశాఖ లేదా విజయవాడ ఇస్తేనే 6 ఎంపీలకు ఒప్పుకుంటామని తెలిపింది బీజేపీ. విశాఖ పై తేల్చకపోవటంతో ఈ నెల 15న జరగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షో రద్దు అయింది. బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాల్లో వలస నేతలకు సీట్ల పై కమలం నేతలు రగిలిపోతున్నారు.
పవన్ బలం ఏమైంది…. ఇంతలా బేలగా ఎన్నికల ముందు ఏంటీ పరిస్థితి అంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు, పవన్ తో ఒక ఆట ఆడుకుంటుంది బీజేపీ. బీజేపీ తీసుకుంటున్న స్థానాల్లోనే అసలైన రాజకీయం ఉంది అని జనసేన నేతలతో పాటు తెలుగు తమ్ముళ్లూ అర్ధం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.