Friday, March 29, 2024
- Advertisement -

బాల్క సుమన్ పై జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు

- Advertisement -

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చంపారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించి తనకు సమాచారం ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. తన గడ్డంలో వెంట్రుకతో బాల్క సుమన్ సమానమనీ పీకేస్తే పోతాడంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై టీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ ఓయూలో అడుగుపెట్టాలంటూ బాల్క సుమన్ కామెంట్ చేయడం దుమారం రేపింది. బాల్క సుమన్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకుండా వీసీని టీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకుంటే ఏం చేయాలో అదే చేస్తామన్నారు.

ఉద్యమ సమయంలో బాల్క సుమన్ ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చంపి.. వారి శవాల దగ్గర సూసైడ్ నోట్ పెట్టినట్లు తనకు కొన్ని లేఖలు అందాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై విచారణ జరిపిస్తామనీ… సుమన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సుమన్ కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు పీకే ఊహించని షాక్

పీకే నిర్ణయంతో టీపీసీసీ నేతలకు ఊరట

కమ్మ మంత్రులపై కుట్రలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -