Monday, April 29, 2024
- Advertisement -

నువ్వు నేర్పిన విద్యే.. జగన్ కు జనసేన కౌంటర్ !

- Advertisement -

ఏపీలో అధికార వైసీపీ మరియు జనసేన మద్య మాటల తుటాలు ఓ రేంజ్ లో పెళుతున్నాయి. ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. ఈ నెల 15న విశాఖలో జరిగిన ఘటన తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గేరు మార్చి అధికార వైసీపీ పార్టీ నేతలపై ఎప్పుడు లేని విధంగా భూతు వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా.. అంటూ వైసీపీ నేతలను కొడకల్లారా అంటూ భూతు పదజాలలతో విరుచుకుపడ్డారు పవన్. ఇక పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికి వైసీపీ అధినేత ఏపీ సి‌ఎం జగన్ కూడా పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాజకీయ చరిత్రలోనే ఏ నాయకుడు మాట్లాడని విధంగా పవన్ వ్యాఖ్యలు చేశారని, పవన్ చేసిన వ్యాఖ్యలను వీధి రౌడీలు కూడా మాట్లాడారని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. ఇక వైఎస్ జగన్ పవన్ పై చేసిన వ్యాఖ్యలకు జనసేన స్పందించింది. ” నీవు నేర్పిన విధ్యే నీరజాక్ష.. ” అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ” రాజకీయ నాయకుడు ఎవరైనా అపద్దాలు చెబితే చెప్పులు చూపిస్తాము.. చీపుర్లు చూపిస్తాము.. ” అని జగన్ చెప్పుకొచ్చారు. ఆ వీడియోను జనసేన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. మీరు నేర్పిన విధ్యే నీరజాక్ష అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ విడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. జగన్ ఆ నాడు అన్నందుకే పవన్ ఈనాడు చెప్పు చూపించడాని నెటిజన్స్ కామెంట్ పెడుతూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -