Thursday, May 2, 2024
- Advertisement -

మంగ‌ళ‌గిరి పోటీని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చిన జ‌గ‌న్‌

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. అధికార ,ప్ర‌తిప‌క్ష పార్టీలు 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో అధికారంలోకి రావ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్‌కు నానా తంటాలు ప‌డి గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజిక వ‌ర్గం నుంచి పోటీలోకి దించాల‌ని ఫిక్స్ అయింది టీడీపీ పార్టీ. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ సీటును వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. తాజాగా సీటు నుంచి నారా లోకేశ్ పోటీ చేయ‌డంతో ఒక్క‌సారిగా స‌మీక‌ర‌ణలు మారిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణ కేవ‌లం 12 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. దీంతో ఈసారి టికెట్ అత‌నికి ద‌క్క‌క‌పోవ‌చ్చు అనే వార్త‌లు కూడా వ‌చ్చాయి. కాని జ‌గ‌న్ టికెట్ ఆళ్ల రామ‌కృష్ణ‌కే కేటాయించారు.

కాని ఇప్పుడు మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తుండ‌టంతో అక్క‌డ ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట వైసీపీ అధినేత‌. దీనిలో భాగంగానే ఇటీవ‌లే పార్టీలో చేరిన జునియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావును రంగంలోకి దించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట జ‌గ‌న్‌. అటు నార్నే కూడా నారా కుటుంబంతో ఢీ కొట్టేందుకు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. నార్నే అయితేనే నారా లోకేశ్‌ను ఆర్ధికంగా త‌ట్టుకోగ‌ల‌ర‌ని పార్టీలో కూడా చ‌ర్చించుకుంటున్నార‌ట‌. దీంతో నారా లోకేశ్‌తో నార్నే శ్రీనివాస‌రావు పోటీ ప‌డటం ఖాయం అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ‌కు వేరే చోట టికెట్ ఇవ్వ‌డం , లేక పార్టీఅధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేస్తాన‌ని మాట ఇచ్చార‌ట జ‌గ‌న్‌. ఏది ఏమైన నారా లోకేశ్‌పై ఎన్టీఆర్ మామ‌ను పోటీలోకి దించి పోటీని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చారు జ‌గ‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -