వైసీపీ నిర్వహించిన జాతీయ ప్లీనరీ తర్వాత పార్టీలో కొత్త ఊపు వచ్చింది.అనుకున్న కాడికి డబుల్ ప్రజలు,కార్యకర్తలు ప్లీనరీకి రావడంతో ఊహించని విధంగా విజయవంతం అయ్యింది.దీంతో ఏపీలో కాపు సామాజిక వర్గంకూడా జగన్కు అండగా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి బాబు అన్యాయం చేయడంతో అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.వైఎస్ హయాంలో రవాణా మంత్రిగా ఓవెలుగు వెలిగిన కన్నా కొన్ని కారనాల వల్ల కాంగ్రెస్ నుంచి భాజాపాలో చేరారు.అనుకున్నంత మైలేజీ రాకపోవడం మిత్ర పక్షం టీడీపీకూడా భాజాపా నేతలకు పెద్దపీట వేయడంతో రాజకీయాల్లో లేకుండా పోయారు.అనుకున్న ప్రాధాన్యం దక్కకపోవడంతో పార్టీ మారాలనే ఆలోచనలో కన్నా వర్గం ఉందట.
ప్రస్తుతం ఏపీలో ప్రత్యామ్నాయం వైసీపే కాబట్టి జగన్ చెంతకు చేరుకోవాలని కన్నా వర్గం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.పలు సర్వేలల్లో వైసీపీ అధికారాన్ని చేపట్టనుందని తేలింది.గత సార్వత్రిక ఎన్నికల్లో బాబుకు అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం ఇప్పుడు వ్యతిరేకంగా మారింది.మరో వైపు అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ముద్రగడకూడా బాబుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న సంగత తెలిసిందే.
ఇప్పటి వరకు కాపుసామాజిక వర్గం బాబుకు పైన సపోర్టు ఇస్తున్నా అదును చూసుకొనిదెబ్బకొట్టాలని భావిస్తున్నారట.ఈ వర్గానికి రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వకుంటె వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది.అలాంటి పరిస్థితుల్లో ముందునుయ్య..వెనుక గొయ్యిలాగా బాబు పరిస్థిత తయారవుతుంది.బలమైన కాపు వర్గానికి చెందిన కన్నా పార్టీలో చేరడం వల్ల వైసీపీకి మరింత మైలేజి రానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
- Advertisement -
వైసీపీలోకి కాపు వర్గానికి చెందిన మాజి మంత్రి …
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -