వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్.. ఐదు మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ఎన్నుకున్నారు. ఖమ్మం మున్సిపాలిటికి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఖరారు అయ్యారు.మేయర్గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహ్రో పేర్లను ఖరారు చేశారు.
ఈ మేరకు వీరిద్దరి పేర్లను ఎన్నికల పరిశీలకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కార్పొరేటర్లుగా గెలిచిన అభ్యర్థుల చేత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది.
మేయర్గా మాజీ ఎంపీ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ పేర్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ప్రకటించారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఏ నెలలో వస్తుందో తెలుసా?
ఆ స్టార్ హీరోలపై కన్నేసిన నిధి అగర్వాల్… మాములు జోరు కాదుగా!