మంత్రిగా కేసీఆర్ మనవుడు ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ నిజమే ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంత్రిగా కేసీఆర్ మనవుడు కేటీఆర్ కొడుకు ప్రమాణస్వీకారం చేస్తాడంటా….ఈ మాటలు అన్నది స్వయంగా కాంగ్రెస్ నాయకుడు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈదఫా కొడుకు, అల్లుడిని మం త్రులను చేసిన కేసీఆర్ రెండో దఫా గెలిస్తే మన వళ్లను మంత్రులను చేసే ప్రమాదముందన్నారు.
తెలంగాణ వచ్చిందని అందరూ సంబరపడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి అవినీతి, కుటుంబపాలన సాగిస్తూ ప్రజలను అవమాన పరుస్తున్నారన్నారు. గత ఆంధ్ర పాలన కన్నా కేసీఆర్ పాలనే వరస్ట్గా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్శ్రేణులను ఏకం చేసి కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కలిసిక ట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని గతం లో మూడు పర్యాయాలు సీఎంకు విజ్ఞప్తి చేశాను. అయి నా సీఎం మిర్యాలగూడను జిల్లా చేయడంలో నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఎవరైనా వారిని ఒప్పించి మిర్యాలగూడను జిల్లా చేయించే బాధ్యత తనదేనన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతం డబ్బును ఆంధ్రప్రాంతంలో ఖర్చుచేస్తే ఇప్పుడు హైదరాబాద్, దక్షిణ తెలంగాణ ప్రాంతాలనుంచి వచ్చే ఆదాయాన్ని గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లో ఖర్చుచేస్తూ మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.