Thursday, May 16, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో మ‌రింత బ‌లం పుంజుకోనున్న వైసీపీ..

- Advertisement -

క‌ర్నూలు జిల్లాపై వైసీపీ మ‌రింత ప‌ట్టు సాధించ‌నుంది.ఎన్నిక‌ల స‌మ‌యం ఇంకా ఉన్నా ఇప్ప‌టినుంచే వైసీపీలోకి ఇత‌ర పార్టీల నేత‌లు వెల్లేందుకు సిద్ధంగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కుటుంబం పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు.మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, మాజీ మంత్రిగా పని చేసిన అనుభవంతో పాటు, కర్నూలు జిల్లాలో అపారమైన ప్రజాభిమానం ఉన్న ‘కోట్ల’ కుటుంబ పెద్ద కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్ లేదని భావిస్తున్న ఆయన ఎన్నిక‌ల నాటికి వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కోట్ల కుటుంబానికి డోన్, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరసర్కరించినా, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, ఆ పార్టీని వీడకుండా ఉన్నారు. ఇప్పుడు తన రాజకీయ వారసుడిగా కుమారుడిని నిలపాలని భావిస్తున్న ఆయనకు, కార్యకర్తల నుంచి వైకాపాలోకి చేరాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైకాపాలో చేరాలని అనుకుంటే, ఆయన్ను ఘనంగా పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ కూడా నిర్ణయించినట్టు సమాచారం.
వైకాపాలో చేరే విషయంలో మాత్రం తన మనసులో ఏముందోనన్న విషయాన్ని ఆయనింకా వెల్లడించక పోవడం గమనార్హం. ఏ పార్టీలో చేరినా, భారీ బహిరంగ సభ పెట్టి, తన సతీమణి సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రరెడ్డిలతో కలసి పార్టీ మారాలన్నది కోట్ల సూర్యప్రకాశరెడ్డి అభిమతమని సమాచారం. ఇక టీడీపీలో చేరే అవ‌కాశం లేదుకాబ‌ట్టి వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -