ఏపీలో ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్షపార్టీ వైసీపీనేతలను టీడీపీలోకి చేర్చుకుంటున్న పార్టీ సీన్ రివర్స్ అయ్యింది. ప్రలోభాల ద్వారా జగన్ పార్టీనేతలను సంతలో పశువుల్లా కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ ఎంపీ బుట్టారేణుకను పార్టీలోకి చేర్చుకొని సంబరిపడిపోతున్న బాబుకి రివర్స్ షాక్ తగిలింది. కర్నూలు జిల్లా టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్బాయ్ చెప్పడంతో అధికారపార్టీకి పెద్ద మైనస్సే చెప్పాలి.
కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన ఈయన 40 సంవత్సరాలుగా కోవెలకుంట్ల పట్టణంలో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తున్నారు. రామిరెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి పేద కుటుంబాల జీవనోపాధికి, పేద యువతుల వివాహానికి ఆర్థికసాయం అందిస్తున్నారు.
1987వ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎంపీపీ స్థానాన్ని కేటాయిస్తూ ఎంపీటీసీ టికెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అప్పటినుంచి టీడీపీలోనె కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ జనార్దన్రెడ్డికి కోవెలకుంట్ల పట్టణంలో భారీ మెజార్టీ వచ్చేలా చేశారు. దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశానికి సేవలందిస్తున్న రామిరెడ్డికి ఇటీవలి కాలంలో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిపోవడంతో మనస్తాపం చెంది వైసీపీ ఖండువా కప్పుకున్నారు.
జగన్ పాదయాత్రలో డాక్టర్ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరగా, వారందరినీ జగన్… సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దూరు రామసుబ్బారెడ్డి, అలాగే బనగానపల్లె మండలం కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నడిపెన్న, మహేష్ తో పాటు పలువురు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది