వైసీపీ పార్టీనుంచి టీడీపీలోకి వలసలు జరుగుతున్నాయి. పార్టీలో గోడమీద పిల్లుల్లా ఉన్న వాల్లంతా సందుచూసుకొని పచ్చఖండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారు. తాజగా గత కొంతకాలంగా పార్టీ మారడంపై ఊగిసలాడుతున్న కర్నూలు ఎంపీ బుట్టారేణుక మెల్లో పచ్చఖండువా కప్పుకున్నారు. పార్టీ మారిన తర్వాత ప్రతీ ఒక్కరూ చెప్పేది అభివృద్ధి మంత్రం. ఇప్పుడు బుట్టా రేణుక కూడా అదే చెప్పింది.
బాబు సమక్షంలో పచ్చఖండువా కప్పుకున్న రేణుక తాజాగా స్పందించారు. అభివృద్ధికోసమే టీడీపీలో చేరానని…అభివృద్ధి కోరుకొనే వాల్లంతా అధికారపార్టీలోకి రావాలని పిలుపు నిచ్చారు. తన దృష్టి అంతా అభివృద్ధిపైనె ఉందని చెప్పారు. అందుకే నేడు అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబునాయుడుకి సహకారమందించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ప్రజా సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించడం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు బుట్టా రేణుక వెల్లడించారు. తన నిర్ణయం వెనుక పార్టీ ఫిరాయింపులు, ఎవరినో మోసం చేయడాలూ లేవని చెప్పడం బాగానె ఉంది. మరి ఇన్నాల్లు అభివృద్ధి ఎక్కడికి పోయింది. ఇప్పుడే అభివృద్ధి గుర్తుకొచ్చినట్లుంది. మూడేల్లుగా లేని అభవృద్ధిని సంవత్సరంలో అభివృధ్ధి సాద్యమా.
అందరు అభివృద్ధి…అభివృద్ధి అని కలవరిస్తున్నారు. నిజంగా ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక తమ సొంత అభివృద్ధిని కోరుకుంటున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికె టీడీపీ తో రూ.100 కోట్లకు బేరం కుదుర్చుకుందనె వార్తల్లో నిజం లేకపోలేదు. తమ వ్యాపారాలను అభివృద్ధిచేసుకొనేదానికి ప్రజల అభివృద్ధి అని ముసుగువేయడం పరిపాటిగా మారింది. పార్టీలో చేరినందుకు సంతోషం. ఎందుకంటె వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు చేయలేదు. ఒక పార్టీ తరుపున గెలిచి వేరె పార్టీలోకి మారిన వారిని ఫిరాయింపు నేతలు అనక ఏమంటారో ఆ ఎంపీకె తెలయాలి.