ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు వైసీపీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఎన్నికల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు మావైపె ఉన్నారని వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా లగడపాటి సర్వే పార్టీ నేతగుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.
ఇన్నాల్లు అధికారం మాదేనని నేతలు పెట్టుకున్న ఆశలపై నీల్లు చల్లినట్లు అయ్యింది. సర్వేల రారాజుగా లగడపాటికి మంచి పేరుంది. ఇప్పటికే ఆయన చేసిన అనేక సర్వేలు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా 2019 ఎన్నికల్లో ఏపార్టీకి ఎన్నిస్థానాలు వస్తాయో కొత్తగా విడుదలైన సర్వేలో వైసీసీకి దిమ్మతిరిగే నిజాలు వెల్లడయ్యాయి.
2019 లో తెలుగుదేశం పార్టీకి 71 సీట్లే వస్తున్నాయి. తర్వాతి స్థానం జనసేనకు 65 …. 39 సీట్లతో మూడో స్థానానికి వైసీపీ పరిమిత మవుతుందనె ఫలితాలు వచ్చాయి. సర్వే ఫలితాలను చర్చించేందుకే ఆయన ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారని తెలుస్తోంది. ఈ ఫలితాలపై వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి.