రోజు రోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతుంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే చర్చ జరిగింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ పూర్తిగా లాక్డౌన్ విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ను పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అములు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణం అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
తెలంగాణలో రాత్రి 9.30 గంటల లోపల అన్ని షాపులు మూసివేయాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు. లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. అలానే లాక్ డౌన్ నిబంధనాలు అందరు పాటించాలి.
అనుచరుడి భాస్కరరావు అంత్యక్రియల్లో కుప్పకూలిన నాని..!
1,088 అంబులెన్స్లను ప్రారంభంచిన జగన్ సర్కార్..!