Friday, March 29, 2024
- Advertisement -

మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

- Advertisement -

బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:45 గంటలకు మమతతో గవర్నర్ జగదీప్ ధన్ కడ్ ప్రమాణం చేయించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ రోజు ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కోవిడ్-19 ఉద్ధృతితో కొద్దిమంది ప్రముఖులకే ఆహ్వానం ఇచ్చినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించగానే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దీనిపై స్పందించారు.

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త దీదీకి శుభాకాంక్ష‌లు అని మోదీ ట్వీట్ చేశారు. మరోపక్క, మ‌మ‌తకు ప‌లువురు నేత‌లు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -