- Advertisement -
పురపాలక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు. పోలింగ్ బూత్ నెంబర్ 2/1 వద్ద ఎమ్మెల్యే దంపతులు క్యూలైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలకృష్ణ దంపతులు క్యూ లైన్ లో నిల్చుని ఓటువేశారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని బాలయ్య కోరారు. ఈ సందర్భంగా పలువురు అక్కడ గుమి కూడటంతో పోలీసులు వారందరని కంట్రోలో చేశారు. సెలబ్రెటీ అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయడం అనేది ఓటు యొక్క విలువ ఏంటో అందరికీ తెలియజెప్పారని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
ఎవరు ఎక్కడ ఓటు వేశారు.. ఏం అన్నారు అంటే..!