Thursday, May 2, 2024
- Advertisement -

సామాన్యుడిలా నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ!

- Advertisement -

పురపాలక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు. పోలింగ్ బూత్ నెంబర్ 2/1 వద్ద ఎమ్మెల్యే దంపతులు క్యూలైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలకృష్ణ దంపతులు క్యూ లైన్ లో నిల్చుని ఓటువేశారు.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని బాలయ్య కోరారు. ఈ సందర్భంగా పలువురు అక్కడ గుమి కూడటంతో పోలీసులు వారందరని కంట్రోలో చేశారు. సెలబ్రెటీ అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయడం అనేది ఓటు యొక్క విలువ ఏంటో అందరికీ తెలియజెప్పారని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.

ఎవరు ఎక్కడ ఓటు వేశారు.. ఏం అన్నారు అంటే..!

మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ.. వీడియో వైరల్!

నేరుగా అక్కడికి వెళ్లిన నిమ్మగడ్డ.. పవన్ కళ్యాణ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -