- Advertisement -
వైఎస్ జగన్ ఒక వైపు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటె….మరో వైపు అంతే స్పీడ్లో పార్టీలోకి వలసలు మాత్రం ఆడగంలేదు. నామినేషన్ల పర్వం ముగిసినా కూడా అధికార పర్టీనుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరిలోని పాలకొల్లులో నిర్వహించిన సభలో జగన్ సమక్షంలోప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భావోద్వేగానికి లోనైన చిన్ని కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. చిన్ని కృష్ణతో పాటు ప్రముఖ ఎస్సీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, దళిత నేత గురుప్రసాద్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. సినీ ప్రముకుల చేరికతో వైసీపీకి సినీ గ్లామర్ రోజురోజుకీ పెరుగుతోంది.