Thursday, May 2, 2024
- Advertisement -

జ‌గ‌న్ అడుగులో అడుగేసిన థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ

- Advertisement -

జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌జ‌ల‌కోసం జ‌గ‌న్ ప‌డుతున్న త‌ప‌న‌ను చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారు. సినిమా వ‌ర్గాల‌నుంచి కూడా జ‌గ‌న్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఇటీవల సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైఎస్‌ జగన్‌ను కలిసి త‌న మద్దతు ప్రకటించారు. ఆయ‌న‌తో పాటు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. తాజాగా మరో నటుడు పృథ్వీ రాజ్‌ మంగళవారం జననేతను కలిశారు. వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

జ‌గ‌న్ అడుగులో అడుగేస్తూ జ‌గ‌న్‌తోపాటే న‌డిచారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంద‌న్నారు. మండుటెండలను లెక్కచేయకుండా.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజల కోసం ఏదో చేయలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపిస్తోందంటూ ప్ర‌శంశ‌ల జ‌ల్లు కురిపించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీదే అధికారం. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు. వైఎస్‌ జగన్‌ జననేత. మాట తిప్పని, మడమ తిప్పని మహాయోధులు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ మాత్రమే. నేను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరే. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగి పోయిందంటే జగన్‌కు ఏ స్థాయిలో జనాధరణ ఉందో అర్ధమవుతోంది’ అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -