ఒక సారి రాజకీయాల్లోకి ఎంటరైతె తన,మన బేధం ఉండదు. అవసరాలను బట్టి రాజకీయాలు మారుతుంటాయి. ప్రస్తుతం ఇదే పార్ములాను ఫాలో అవుతున్నారు భాజాపా సీనియర్ మహిళానేత. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన రాజకీయ కుట్రల కారనంగానె ఓటమి చెందారనేది తెలిసిందే. ఇప్పుడు అలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. దీంతో చంద్రబాబుకు ఇప్పటినుంచె నిద్రలేకుండా చేస్తున్నారు.
అమె ఎవరో కాదు… భాజాపా సీనియర్నేత,కేంద్రమాజీ మంత్రి స్వయానా చంద్రబాబు వదిని అయిన పురందేశ్వరిదీవి. 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీడీపీలు జట్టుగానే ఎన్నికలకు వెళ్లనున్నాయి.
2014లో ఆయన తనపై చూపించిన వివక్షను ఇప్పుడు తీర్చేసుకోవాలని ఆమె డిసైడ్ అయ్యారని తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురందేశ్వరి.. అప్పటి తన సిట్టింగ్ ఎంపీ సీటు విశాఖ కావాలని అధిష్టానం వద్ద ఏకరువు పెట్టారు. అయితే, అప్పట్లో బీజేపీలోనూ టికెట్ల కేటాయింపులో చక్రం తిప్పిన బాబు…ఓడిపోయె రాజంపేట సీటును కేటాయించారు. సమయం వచ్చినప్పుడల్లా బాబును ఏకేయడానికి రెడీ అయ్యేవారు. అయితే ఇప్పుడు అమెకు ఛార్స్ వచ్చింది.
హిందూపురం టీడీపీకి కంచుకోట లాంటి సీటు. దీన్ని బాబు వదులు కుంటారా..? బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్ర పక్షం ఒత్తిడి మేరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రకంగా బాబును ఇరుకున పెట్టి.. తన కసి తీర్చుకునేందుకు పురందేశ్వరి సిద్ధమైనట్టు సమాచారం. చంద్రబాబుకు ఈ సీటును ఇవ్వలంటే పెద్ద తలనొప్పే. ఎప్పటి నుంచో అచ్చొచ్చిన ఈ స్థానాన్ని బీజేపీకి అప్పగించేయడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.
ప్రస్తుతం అక్కడ టీడీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయన్ను తప్పించాలంటే బీసీల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం ఆయన వచ్చే ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అలా అయితే పెనుగొండలో బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని తప్పించాలి. అలాచేస్తె బాబుకు ఇబ్బందే.
వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్, సునీత ఇద్దరూ పోటీ చేస్తామని తమకు రాఫ్తాడుతో పాటుపెనుగొండ సీటు కూడా కావాలని అంటున్నారు. ఇక్కడే బాబుకు ఇన్ని చిక్కులు ఉంటే ఇప్పుడు పురందేశ్వరి హిందూపురం ఎంపీ సీటు మీద కన్నేసి బాబు ఏం చేయాలో తెలియని డిఫెన్స్లో పడటం ఖాయం. ఇలా చిన్నమ్మ బాబుకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నారు.