2019 ఎన్నికల అభ్యర్తుల విషయంలో వైసీపీ దూసుకుపోతోంది. ఒక వైపు పాదయాత్ర చేస్తున్న జగన్ మరోవైపు అచ్చే ఎన్నికలకు అభ్యర్తులను సిద్ధం చేస్తున్నారు. ఒక వైపు పాదయాత్ర మరోవైపు ముఖ్యమైన నియోజక వర్గాలకు అభ్యర్తులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికలకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి… అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభినట్టు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొన్ని చోట్ల ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాల్లో… టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారనే విషయాన్ని ఇప్పటికే ఒక కీలక నేతతో చెప్పించినట్టు చెప్పుకుంటున్నారు.
టీడీపీకి బాగా పట్టున్న తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సిటీ, రాజోలు, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రాపురం అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు సమాచారం. రాజమండ్రి, అమలాపురం లోక్ సభ స్థానాలకు కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై వైసీపీ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి .
రాజమండ్రి పార్లమెంట్ టికెట్ను టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్కు కన్ఫమేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ స్థానంలో అతని సామాజికవర్గం కూడా అతనికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎంపీ టికెట్ కోసం అతను ప్రయత్నించినట్టు చెబుతున్నారు. అమలాపురం స్థానం నుంచి ఓ రిటైర్డ్ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ను బరిలోకి దించనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా 2014 ఎన్నికల్లో జరిగిన తప్పులు మరో సారి జరగకుండా వైసీపీ ముందుచూపుతో ముందుకెల్తున్నట్లు తెలుస్తోంది.