మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని వివరించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల గత కొన్ని నెలలుగా పార్టీలో క్రియాశీలంగా లేరు. 2014లో టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి పోటీచేసి ఆయన గెలిచారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు బీజేపీకీ గుడ్ బై చెప్పడంతో రావెల భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. అయితే రావెల మళ్లీ తెలుగు దేశం కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో కొన్ని రోజులు వేచి చూడాలి.
దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు