Tuesday, April 23, 2024
- Advertisement -

నిమ్మ‌గ‌డ్డ‌కు కూడా ఆ విష‌యం తెలుసు: స‌జ్జ‌ల‌

- Advertisement -

ఉన్న‌తాధికారుల ప‌ట్ల ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వాడిన భాష స‌రికాద‌ని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికార యంత్రాంగాన్ని అస్థిర‌ప‌ర‌చాల‌ని ఆయ‌న చూస్తున్నార‌ని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌లో ఎస్ఈసీ పార్్ట‌న‌ర్‌గా ఉన్నార‌ని, బాబుది నిమ్మ‌గ‌డ్డ‌ది ఒక‌టే డీఎన్ఏ అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఇలాంటి వ్య‌క్తి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఉండ‌టం ఏపీకి ప‌ట్టిన ఖ‌ర్మ అని స‌జ్జ‌ల అన్నారు.

ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యాల‌పై నిమ్మ‌గ‌డ్డ‌ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, త‌న ప‌రిధిలోలేని అంశాల గురించి ఆయ‌న మాట్లాడుతున్న తీరు ఇందుకు నిద‌ర్శ‌నం అన్నారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే కనీసం 2 నెలలు పడుతుంద‌ని, అప్ప‌టి దాకా ఎన్నికలు జరపడం క‌ష్ట‌మేన‌న్న విష‌యం తెలిసి కూడా అధికారుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న‌లు క్రియేట్ చేస్తున్నార‌ని స‌జ్జ‌ల మండిప‌డ్డారు. అధికారుల‌ను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌జ్జ‌ల హామీ ఇచ్చారు. గ‌తంలో చంద్రబాబు ఎలా వ్య‌వ‌హ‌రించారో తెలుసుకుని మాట్లాడాల‌ని నిమ్మ‌గ‌డ్డ తీరును విమ‌ర్శించారు.

ఎస్ఈసీ పై మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి

అందాల రాక్ష‌సి ముద్దు పెడుతోందా?

హిట్‌మాన్ పాపం.. వారిలో జ‌డేజా ఒక్క‌డే

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -