ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ము రేపాడు. బ్యాటర్ల విభాగంలో వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ 1గా నిలిచాడు. 870 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో భారత ఆటగాడు రోహిత్ శర్మ కూడా 842 పాయింట్లతో సత్తా చాటాడు. కోహ్లి తర్వాత స్థానంలో హిట్మాన్ నిలిచాడు.
పాక్ బ్యాటర్ బాబర్ ఆజం మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ కంటే 5 పాయింట్లు తక్కువ ఉండటంతో వెనుకబడిపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ వరుసగా 4,5 స్థానాలు ఆక్రమించారు. ఇక బౌలింగ్ విభాగంలో.. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో ఆప్ఘన్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఉన్నాడు.
ఇక ఇటీవలి ఆసీస్ టూర్లో సత్తా చాటిన టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. వీరి తర్వాత బంగ్లా బౌలర్ మెహదీ హసన్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ టాప్ 5లో చోటు సంపాదించారు. ఆల్రౌండర్లలో బంగ్లా ఆటగాడు షకీబ్ ఆల్ హసన్ అగ్ర స్థానంలో ఉండగా.. భారత్ నుంచి రవీంద్ర జడేజా(8వ స్థానం) మాత్రమే టాప్ టెన్లో నిలిచాడు.
గంగూలీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన..
అందాల రాక్షసి ముద్దు పెడుతోందా?