టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వాకంపై ఏపీ ఎన్నికల కమిషన్ స్పందించింది. పంచాయతీ ఎన్నికల వేళ మేనిఫెస్టో విడుదల చేయడంపై వివరణ అడిగింది. దీనికి సంబంధించి శనివారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం లోపు ఈ విషయంపై వివరణ ఇవ్వాలని గడువు విధించింది.
కాగా పల్లె ప్రగతికి పంచసూత్రాలు అంటూ పంచాయతి ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని చంద్రబాబు గురువారం ఓ మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీ ప్రస్తావన లేకుండా జరిగే ఈ ఎలక్షన్లో బాబు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో ఆయనతో పాటు ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు కొత్త చిక్కు వచ్చి పడింది.
ఈ క్రమంలో అధికార వైఎస్సార్ సీపీ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎస్ఈసీ శనివారం టీడీపీకి నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మొసలితో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?
బాడీనే కాదు బుర్ర కూడా ఉండాలనేది అందుకే!