- Advertisement -
సినీ నటి, బిజేపి నాయకురాలు ఖుష్బూ సుందర్కు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం గురించి తెలియజేస్తూ ఖుష్బూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు.
కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్ ఢీ కొట్టింది. దేవుడి దయ వల్ల సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని ఖుష్బూ పేర్కొన్నారు. కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారన్న వివరాలు తెలియరాలేదు.