కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’లో కీలక వ్యాఖ్యలు చేయటంపై స్పందించింది శివసేన. రాహుల్కు మద్దతుగా నిలిచింది. ఒబామాకు భారత్ గురించి ఏమాత్రం తెలుసు? అని ప్రశ్నించారు శివసేన నేత సంజయ్ రౌత్. భారతీయ రాజకీయ నాయకులపై ఒక విదేశీ రాజకీయ నాయకుడు అలాంటి అభిప్రాయాలు వెల్లడించటం సరికాదని సూచించారు.
ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. అందులో వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. పని పూర్తిచేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో లేదని వ్యాఖ్యానించారు ఒబామా. స్పష్టత గానీ, ధైర్యం గానీ ఆయనలో కనిపించదన్నారు.
అమెరికా ఎన్నికలపై ఫేస్బుక్ కామెంట్..!
ట్రంప్ 232.. డెమొక్రాట్ కి 306.. నయా లెక్కలు..!