Sunday, April 28, 2024
- Advertisement -

టిడిపికి రిలీఫ్.. నిన్న రాజీనామా నేడు యూ టర్న్!

- Advertisement -

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టిడిపికి ఊరట లభించింది. కాకినాడ‌రూర‌ల్ మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి వీరవెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) దంపతులు శుక్ర‌వారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మరీ తమ పదవులకు రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. చిన‌రాజ‌ప్పతో పాటు మ‌రికొంత మంది పార్టీ నాయకుల‌తో త‌మ‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని, అందుకే తీవ్ర మ‌న‌స్తాపంతో టిడిపిలో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నామ‌ని వారు నిన్న ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు పార్టీ తరపున అభ్యర్థులను గెలిపించుకోలేని పరిస్థితుల నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమె భర్త రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే తాజాగా వారు యూటర్న్ తీసుకున్నారు. పదవులకు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు శనివారం తెలిపారు. పార్టీ అధిష్టానం, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి ఆమె భర్త మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు.

కేంద్రానికి భయపడి పవన్ సేమ్ గేమ్!

నిమ్మగడ్డ కి ఎదురు దెబ్బ..పెద్దిరెడ్డి కి గుడ్ న్యూస్..!

ఈ పండ్లు కిలోకు ల‌క్ష రూపాలు.. మ‌న దేశం‌లో ఎక్క‌డున్నాయో తెలుసా?

ఈయ‌నే స‌లార్ విల‌న్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -