పవన్ కల్యాణ్ స్పీచ్ లు మాత్రమే దంచి కొడతారు.. అసలు విషయానికి వచ్చే సరికి వెనకడుగు వేస్తారు అనే విషయం మరోసారి తేటతెల్లం అయింది. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా జగన్ సర్కారును మాత్రమే దోషిగా పవన్ మాట్లాడడం పట్ల ఆయన ఒత్తిళ్లకు ఎంతగా తలొగ్గి పనిచేస్తున్నారో ఋజువైంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేరు మీదుగా విడుదలైన ప్రకటనే ఇందుకు నిదర్శనం.
నాదెండ్ల పేరుతో వెల్లడైన ఆ ప్రకటనలో ఏమున్నదంటే.. ‘తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఎంతో బాధాకరం. వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీలు ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించాలని ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ కోరుతున్నారు’ అని నాదెండ్ల మనోహర్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షాను పవన్ కోరుతున్నారని నాదెండ్ల చెప్పడం ఏంటి?నేరుగా పవన్ పేరుతోనే ఆ ప్రకటన ఇవ్వొచ్చు కదా? ఏపీ విషయానికి వస్తే మాత్రం సీఎం జగన్పై విమర్శలు చేయడానికి పవన్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని గమనించవచ్చు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు పవన్ ఎంతగా భయపడుతున్నారో, నాదెండ్ల ఎలా ముందుకు తోసి బకరా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
మరో విషయం ఏంటంటే నాదెండ్లను బకరా చేయడానికి ఓ పథకం ప్రకారం పవన్క ఇలాంటి ప్రకటనలు ఆయన పేరుతో ఇప్పించి తాను సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ జనసేనకు తలనొప్పులు తెచ్చే సమస్య ఏంటంటే నాదెండ్ల అంటే ఆ పార్టీలో చాలా మందికి అసలు పడదు. నాదెండ్లను పవన్ నమ్ముకోవడంపై జన సైన్యం లో చాలా వ్యతిరేకత ఉంది. కేవలం పవన్కు నాదెండ్ల దగ్గరగా ఉన్నారనే కారణంగానే ఆ పార్టీకి చెందిన చిన్నో,గొప్పో నాయకులు కూడా దూరమయ్యారనేది వాస్తవం.
బంపర్ ఆఫర్ కేవలం రూ. 86కే అదిరిపోయే ఇల్లు!
నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!