Monday, May 6, 2024
- Advertisement -

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి కొన‌సాగుతున్న వ‌ల‌స‌లు..

- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకీ రోజు రోజుకీ బ‌లం పెరుగుతోంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న‌ను చూసి ఇత‌ర పార్టీల‌నేత‌లు వైసీపీవైపు చూస్తున్నారు. పాద‌యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టినుంచి పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయే త‌ప్ప త‌గ్గ‌డంలేదు.

తాజాగా మ‌రో మాజీ ఎమ్మెల్యే పార్టీ ఖండువా క‌ప్పుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన రంగనాథరాజు, ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత కలుసుకున్నారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రంగనాథరాజుతో పాటు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం జక్కారంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్మీరెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ లక్ష్మీరెడ్డికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నవరత్నాలు ప్రకటించి, అన్ని వర్గాల వారిని అభివృద్ధిపథంలోకి తెచ్చేందుకు వైఎస్‌ ఇస్తున్న ఆచరణయోగ్యమైన హామీలకు అధికార పార్టీ నేతలు సైతం ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరుతుండటం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -