Wednesday, May 15, 2024
- Advertisement -

పార్టీ మారే యోచ‌న‌లో ప్ర‌కాశం టీడీపీ సీనియ‌ర్ నేత‌…

- Advertisement -

ఎన్నిక స‌మ‌యంలో టీడీపీకీ పెద్ద ఎదురుదెబ్బ త‌గ‌ల‌బోతోందా…? ఆ పార్టీని వ‌దిలి వైసీపీలోకి వెళ్లేందుకు ఆ సీనియ‌ర్‌నేత సిద్ధ‌మ‌వుతున్నారా..? ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్‌నేత ఒక‌రు పార్టీ మారేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆయ‌న పార్టీలో ఉంటారా లేకా వేరే పార్టీలోకి వెల్తారా అన్న అంశంపై అస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆయ‌న ఎవ‌రోకాదు మాగుంట శ్రీనివాసులు రెడ్డి . ప్ర‌స్తుతం టీడీపీ త‌రుపున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్నారనేది చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ త‌రుపున ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ తురుపున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో మాగుంట ఓటమి పాలయ్యారు. ఈ జిల్లాలో వైసీపీకీ ప‌వ‌నాలు అనుకూలంగా ఉండ‌టంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఈ సీటు నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్ప‌టికే వైసీపీ కీల‌క నేత‌ల‌తో సంప్ర‌దింపులు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మాగుంటను వదులుకోవాలని అనుకోవడం లేదట. శ్రీనివాసులు రెడ్డిని వచ్చేసారి టీడీపీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా బరిలోకి దించాలని బాబు భావిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై మున్ముందు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -