Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్‌, ప‌వ‌న్ పై మ‌రో సారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన టీడీపీ ఎంపీ జేసీ

- Advertisement -

టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రో సారి జ‌గ‌న్‌పై నోరుపారేసుకున్నారు. జ‌గ‌న్ పేరు వింటేనే ఒంటి కాలితో లేచే జేసీ  తన దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే జగన్ తాను ముఖ్యమంత్రి కావాలని సిఎం…సిఎం అని కలవరించి ఉంటాడని జేసీ ఎద్దేవాచేశారు.

ప‌నిలో ప‌నిగా జ‌న‌సే అధినేత ప‌వ‌న్ కూడా అదే మాదిరి కలలు కంటున్నారని సెటైర్లు వేశారు. అలాంటి కలలేమీ నెరవేరవని జోష్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదని తాను ఎప్పుడో సీఎం చంద్రబాబుకు చెప్పానని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు

ఉద్యోగులు చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడం, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగులు ప్రభుత్వంపై పీకల దాకా కోపంతో ఉన్నట్లు జేసీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై జేసీ విమర్శలు చేశారు. నాడు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నరసింహన్, నేడు ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారని వ్యాఖ్యనించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -