Monday, May 20, 2024
- Advertisement -

ప‌వ‌న్‌, జ‌గ‌న్‌ల‌ను ఏకిపారేసిన కేసీఆర్‌..

- Advertisement -

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆంధ్రా నేతలైన జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా స్పందించారు. ప్రగతిభవన్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ ఆంధ్రాలో వైసిపి, జనసేన మాట్లాడుతున్న విషయాన్ని ఒక మీడియా ప్రతినిధి లేవనెత్తారు.

అవిశ్వాసం పేరుతో చేస్తున్న రాజకీయాలన్నీ చిల్లర రాజకీయాలే. వీళ్లు అవిశ్వాసం పెట్టి దేశంలో మార్పు తెస్తరా? ఇది అత్యంత చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాద‌న్నారు. ఆంధ్రాకు రావాల్సిన డిమాండ్ల సాధన కోసం ఫైట్ చేయవచ్చు కానీ.. అవిశ్వాసం పెడతా అన్న మాట సరికాదు. దానితో అయ్యేది లేదు పోయేది లేదు అని కేసిఆర్ కామెంట్ చేశారు.

మొత్తానికి ఆంధ్రాలో ఇటు జగన్, అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న అవిశ్వాసం ప్రకటనలపై కేసిఆర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. దీంతో వారిద్దరూ చేస్తున్న రాజకీయాలు పనికిమాలినవి అని తేల్చి పారేశారు కేసిఆర్. ఇప్ప‌టికే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల‌ని రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఇక వైసీపీ ఢిల్లీలో జంత‌ర్‌, మంత‌ర్ వ‌ద్ద‌ధ‌ర్నాచేయాల‌ని ప్ర‌త్యేక రైల్లో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఢిల్లీకి వెల్లారు. మ‌రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -