Tuesday, May 21, 2024
- Advertisement -

టీ కాంగ్రెస్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో

- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవని స్పష్టమైన సంకేతాలు వస్తుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల క‌స‌ర‌త్తుపై బిజీగా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ముంద‌స్తుకు స‌మాయాత్త‌మ‌వుతోంది.

జనాల్లో బలంగా ఉన్న కేసీఆర్ ఛరిష్మాను తట్టుకుని నిలబడాలంటే ప్రజలను ఆకర్షించే హామీలు ఇవ్వాలి. దీనిలో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఈరోజు భేటీ అయింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీ… ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను ఖరారు చేసింది.

టీ.కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా
గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇప్పుడు అదనంగా రూ. 3 లక్షలు
ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ… ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
కల్యాణలక్ష్మి సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న మొత్తాలు రెట్టింపు
విద్య, వైద్య సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు
కుటుంబంలో ప్ర‌తీ ఒక్క‌రికీ 6 కిలోల స‌న్న బియ్యం
అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న మొత్తాలు రెట్టింపు
విద్య, వైద్య సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రణాళికల

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ

నిరుద్యోగులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 3000 భృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -