Saturday, May 11, 2024
- Advertisement -

ఔను మేము భాజాపాలో చేరుతున్నాం…

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్ప‌టికే ఘోర‌ఓట‌మితో కోలుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్న పార్టీ మ‌రింత అగాధంలోకి కూరుకుపోతోంది. మిఔను వాల్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు సినిమా టైటిల్ లాగా …అవును మేము భాజాపాలో చేరుతున్నామ‌ని టీడీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు ప్ర‌క‌టించారు. బాబుకు అర్థికంగా వెన్నుద‌న్నుగా ఉన్న నేత‌లు కావ‌డంతో బాబు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ లు వెంకయ్యనాయుడుని కలిసి ఈ లేఖను అందజేశారు. టీడీపీని విభేదించి బయటకు వచ్చామని, తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని పేర్కొన్న ఈ లేఖపై నలుగురు ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం.

సాయంత్రం ఏడు గంట‌ల‌కు మీడియా స‌మావేశంలో అన్ని విష‌యాలు వివ‌రిస్తామ‌ని సుజ‌నా చౌద‌రి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాము బీజేపీలో చేరుతున్నట్టు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ వ‌ల‌స‌లు ఆపేందుకు స‌ద‌రు నేత‌ల‌కు బాబు ఫోన్లు చేసినా ఎవ‌రూ లిప్ట్ చేయ‌డంలేదంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -